శంఖవరం మండలం అన్నవరం జాతీయ రహదారిపై సుమారు రూ. 20,000,00 విలువచేసే 58 బస్తాల నిషేధిత గుట్కా ప్యాకెట్లను అన్నవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రహదారిపై ఉన్న శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి నమూనా ఆలయం సమీపంలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఎస్సై. ఎస్.రవికుమార్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది వారి రోజు వారీ విధుల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా తుని నుండి కత్తిపూడి వైపు వెళుతున్న ఎ.పి.37 టిఈ 4567 నెంబర్ ఐషర్ వ్యానులో రవాణా అవుతున్న ఈ అక్రమ సరుకును పోలీసులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ తోపాటు సొత్తుకు యజమానులైన ఇద్దరు వ్యాపారస్తులను కలపి మొత్తం నలుగురురిని అదుపు లోనికి తీసుకున్నారు. వాహనాన్నీ, సరకునూ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై నేరాన్ని, అభియోగాలను నమోదు చేసారు. వీరిని ప్రత్తిపాడు కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరచగా వారికి
తాత్కాలిక కారాగార వాస నిర్బంధాన్ని విధించారు. పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకర్ల సమావేశంలో అమలాపురం డీఎస్పీ. అరిటాకుల శ్రీనివాసరావు ఈ వివరాలను వెల్లడించారు. ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు ఇచ్చిన నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన ఆదేశాలకు అనుగుణంగా అన్నవరం ఎస్.ఐ. రవికుమార్, ఆయన సిబ్బంది సంయుక్తంగా వాహనాలను ఆకస్మిక తనిఖీ చేసి ఈ అక్రమ సొత్తు అక్రమ రవాణా గుట్టును రట్టు చేయడంతో ఈ నేరం వెలుగు చూసిందని అమలాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు పాత్రికేయులకు వివరించారు.