విజయనగరం నగరంలోని కేంద్రీయ విద్యాలయం లో ప్రస్తుత (2022-23) విద్యా సంవత్సరంలో ఎస్.టి. కేటగిరీ కి చెందిన విద్యార్ధులు ఒకటో తరగతిలో ప్రవేశం కోసం మూడు సీట్లు అందుబాటులో వున్నట్టు ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మీడియా ద్వారా నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. విద్యా సంస్థలో ప్రవేశం కోసం ఆసక్తి గల సంబంధిత కేటగిరీ కి చెందిన తల్లిదండ్రులు ఈ నెల 25వ తేదీలోగా తమను సంప్రదించాలని కోరారు. ప్రవేశం కోరే విద్యార్థి మార్చి 31, 2014 నుంచి మార్చి 31, 2016 మధ్య జన్మించి వుండాలని పేర్కొన్నారు. ఈ అవకాసాన్ని ఎస్టీ సామాజిక వర్గం విద్యార్ధుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.