ఇండియన్ మిలటరీ కాలేజీలో అడ్మిషన్లుకు ప్రకటన


Ens Balu
64
Dehradun
2023-02-18 11:11:47

ఇండియన మిలటరీ కాలేజీలో చేరాలనుకునేవారికి సదరు సంస్థ గుడ్ న్యూస్ చెప్పంది. డెహ్రాడూన్ లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జనవరి సెషన్) ప్రవేశాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ పరీక్ష ద్వారా విద్యార్ధులకు ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్ధినీ, విద్యార్ధులు 01-01-2024 నాటికి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఏడో తరగతి ఉత్తీర్ణులు/చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 15 వరకూ దరఖాస్తుకు అవకాశం ఉంది. నోటిఫికేషన్ తో పాటు మరిన్ని వివరాలు rimc.gov.in వెబ్ సైట్ లో ఇండియన్ మిలటరీ కాలేజీలో పొందు పరిచింది. మిలటరీ కాలేజిలో చదువు అభ్యసించాలనుకునేవారికి ఇదొక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు..