డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలో 10 మంది డీబార్


Ens Balu
45
Nellore
2023-02-20 14:32:20

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం పరిధిలోని అనుబంధ కళాశాలల్లో జరిగిన డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలో మొత్తం 10535 మంది విద్యార్దులు గాను 9310 మంది విద్యార్దులు హాజరు అయ్యారని పరీక్షల నిర్వహణ అధికారి డా.ఆర్.ప్రభాకర్ తెలియజేశారు. ఈ పరిక్షలకు 1225 మంది విద్యార్దులు గైర్హాజరు కాగా పరీక్ష కేంద్రం  జగన్స్ డిగ్రీ కళాశాల, నెల్లూరు నందు ఇద్దరు విద్యార్థులు, గవర్నమెంట్ డిగ్రీ కళాశాల,నాయుడుపేటలో  ముగ్గురు విద్యార్దులు మరియు PRR & VS గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్సు డిగ్రీ కళాశాల,విడవలూలో ఐదుగురు విద్యార్ధులు  డీబార్ అయ్యారని పేర్కొన్నారు. ప్రతి పరిక్షా కేంద్రంలో ప్రభుత్వం నిర్దేశిoచిన ప్రకారం కోవిడ్ –19 నిబంధనలను పాటిస్తూ విద్యార్దులను  పరీక్షా కేంద్రం లోనికి అనుమతించామన్న ఆయన ప్రతి పరీక్షా కేంద్రంలో మాస్కులు ను తప్పనిసరి చేస్తూ భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినట్టు వివరించారు.