విశాఖపట్నం జిల్లాలో ఆశని తుఫాన్ కారణంగా తేదీ 11-5-2022 న జరగాల్సిన ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరం పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్ష రేపు ఉదయం అనగా 25 - 5 - 2022 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ఎమ్. వినోద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు తేదీ 11- 5 - 22న వాయిదా పడిన మొదటి సంవత్సరం పరీక్షలకు సంబంధించి సమయం, పరీక్ష సెంటర్ గతంలో తెలిపినవే ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు , రీజనల్ ఇన్స్పెక్షన్ అధికారి ( Cell number : 9392911802) తెలిపారు. ఈ విషయాన్ని విద్యార్ధులు గుర్తుపెట్టుకొని నిలిచిపోయిన పరీక్షను రాసుకోవాలని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.