MJMC కోర్సుకి దరఖాస్తులు ఆహ్వానం


Ens Balu
5
Srikakulam
2022-07-14 06:15:40

డా.బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ(శ్రీకాకుళం) నిర్వహిస్తున్న రెండేళ్ల పీజీ - జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ( MJMC)కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ ఈ నెల 20. ఫీజు మరియు దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే సమర్పించాలి. యోగి వేమన విశ్వ విద్యాలయం(కడప) www.yuv.edu.in వెబ్ సైట్ లోకి వెళ్ళి MJMCకు ధరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన సర్టిఫికెట్లు : ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, కులధృవీకరణ సర్టిఫికెట్లుతో పాటు ఆధార్, Scan చేసిన ఫొటో మరియు digital సంతకం ఉండాలి. MJMC కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాలు కోసం గాని ధరఖాస్తు చేసినపుడు ఏవైనా సందేహాలు  ఉంటే నివృత్తి కొరకు డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్శిటీ జర్నలిజం విభాగం అధ్యాపకులు 8790 341 580,  9440 440 966, 830 951 9615 మొబైల్ నెంబర్లకు సంప్రదించవచ్చు. MJMC కోర్సు పూర్తయిన తర్వాత లభించే ఉపాధి అవకాశాలు:  ప్రముఖ పత్రికలు, టీవీ చానల్స్, రేడియో స్టేషన్లలో రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లు, ఫీచర్ స్పెషలిస్టులు, రేడియో జాకీలు, న్యూస్ ప్రెజెంటర్స్ లుగా రాణించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పి.ఆర్.ఓ.లుగా, సమాచార అధికారులుగా, మీడియా కన్సల్టెంట్ లుగా,  మీడియా అడ్వయిజర్ లు గా కార్పొరేట్ కమ్యూనికేషన్ అధికారులుగా ఉద్యోగాలు పొందవచ్చు. బోధన, పరిశోధన రంగాల్లో ఆసక్తి గల వారు ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం కళాశాలలు, పరిశోధనా సంస్థలు, సర్వే సంస్థలు, సామాజిక అధ్యయన కేంద్రాలలో అధ్యాపకులుగా, అధ్యయనకారులుగా కెరీర్ ను ఎంపిక చేసుకోవచ్చు. యూజీసీ నెట్, ఏపీ సెట్ పరీక్షలు రాసేందుకు కూడా ఈ కోర్సు పూర్తి చేసిన వారు అర్హులేనని యూనివర్శిటీ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలియజేసింది.