నవోదయ ప్రవేశాల్లో ప్రభుత్వం కొత్త నిబంధనలు


Ens Balu
27
Delhi
2023-01-04 05:28:29

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలో విద్యార్ధినీ, విద్యార్ధులు ఆరవ తరగతిలో చేరాలనుకుంటే  ఐదో తరగతిని స్థానిక జిల్లాలోనే చదివి ఉండాలి. దీనితో పాటు విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల శాశ్వత చిరునామా సైతం అదే జిల్లాలో ఉండాలి. అంతేకాకుండా విద్యార్థి వయస్సు గ్యాప్ కూడా గతంతో పోలిస్తే రెండు సంవత్సరాలు తగ్గించారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు చేర్చడంతో ఇపుడు విద్యార్ధుల తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కొత్త నిబంధనల వలన చాలా మంది విద్యా్ర్ధులకు దరఖాస్తు సమయంలోచిక్కులు ఎదురవుతున్నాయి.