2023-24 విద్యా సంవత్సరానికి సరుబుజ్జిలి మండలం వెన్నెలవలసలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశం కోసం ఆన్ లైన్ లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ యం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన జారీచేశారు. నవోదయ విద్యాలయ సమితి వెబ్ సైట్: https://navodaya.gov.in నుండి దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల లేదా ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో 3వ, 4వ తరగతులు పూర్తి విద్యాసంవత్సరాలు చదివి.. ప్రస్తుతం 2022-23 విద్యా సంవత్సరాంలో 5వ తరగతి చదువుతున్నవారై ఉండాలని తెలిపారు.
అభ్యర్థులు 1-5-2011 నుంచి 30-4-2013 మధ్యలో జన్మించినవారై ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు అప్ లోడ్ చేసినపుడు సంబంధిత సర్టిఫికేట్లను తప్పనిసరిగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ అని, ఏప్రిల్ 29న్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారనిని పేర్కొన్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలనుకున్నవారు సంబధిత హెడ్ మాస్టర్ సంతకంతో ధ్రువీకరించిన సర్టిఫికేట్ ను తప్పనిసరిగా అప్లోడ్ చేయవలెనన్నారు. జిల్లాలోని అర్హులైన విద్యార్థులందరూ గమనించి, నోటిఫికేషన్ లోని అన్ని విషయములను పూర్తిగా చదివి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని,ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.