జాతీయ ఉపకారవేతనం ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 5న జరగనుందని విశాఖపట్నం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఒక ప్రటకనలో తెలియజేసింది. ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు www.bsc.ap.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసి అందజేయాలని జిల్లాలోని పాఠశాలల ఉపాద్యాయులకు సూచించింది. దీనికోసం పాఠశాల ఉపాధ్యాయులు UDISE కోడ్ ను వినియోగించి లాగిన్ కావాల్సి వుంటుందని తెలియజేశారు. అనంతరం విద్యార్ధులు హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసి అందజేసి పరీక్ష రాయించాలని ఆ ప్రకటనలో సూచించారు.