డిప్లొమా విద్యార్థులకు మంచి భవిష్యత్తు


Ens Balu
16
పార్వతీపురం
2023-01-28 09:55:12

పాలిటెక్నిక్ డిప్లమా చేసినవారికి దేశ విదేశాల్లో మంచి అవకాశాలు ఉన్నాయని, భవిష్యత్ వారిదేనని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు సి.నాగరాణి అన్నారు. పార్వతీపురం ఐటీడీఏలో పాలిటెక్నికల్ విద్య ప్రాముఖ్యతపై స్వీయ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 84 ప్రభుత్వ, 175 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయని, అయితే  విద్యార్థులలో అవగాహన లేక డిప్లొమాలో చేరికలు తక్కువగా ఉన్నాయని వాటి సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో కోచింగ్ ఏర్పాటుకు ఆలోచించాలని అన్నారు. 10వ తరగతి తరువాత మంచి భవిష్యత్తు కు పునాది వేయవలసిన బాధ్యత ఉందని ఆమె అన్నారు.  ఈ కార్యక్రమంలో ఐటీడిఏ పిఓ సి.విష్ణుచరన్, గుమ్మ లక్ష్మీ పురం పొలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ టీ. జగదీష్ బాబు, మండల విద్యాశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.