విద్యార్థులను మనస్తత్వాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి


Ens Balu
14
Vizianagaram
2023-02-03 12:45:51

ఎస్ఈఆర్టీ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎంట్రెప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు వారి సామర్థ్యాలను మెరుగు పరిచేందుకు సృజనాత్మక నైపుణ్యం తో పాటు సాంకేతిక పరిజ్ఞానం అలవర్చుకోవాలని ఈఎండిపి జోనల్ మేనేజర్ ఓ.అగ్ని హోత్ర శర్మ విద్యార్థులకు సూచించారు శుక్రవారం మధనాపురం ఏపీ మోడల్ స్కూల్ ను జిల్లా మేనేజర్ కె.నరేష్ తో కలిసి సందర్శించిన ఆయన పాఠశాలలో జరుగుతున్న ఈఎండిపి ప్రోగ్రాం ను పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో ఫెసిలిటేటర్ అయిన పాఠశాల ఉపాధ్యాయులు వి.మధుసూధనరావు విద్యార్థిని,విద్యార్థులకు 16వ సెషన్ లో భాగంగా సమస్య పరిష్కార పరిశోధన అనే అంశంపై బోధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్.రామకృష్ణ రావు గారు మాట్లాడుతూ ఈఎండిపి ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశ్యం మరియు మార్చ్ నెలలో జరగబోయే ప్రాజెక్ట్ ఎక్స్పో గురించి విద్యార్థులకు వివరించారు.