ఏయూ రెక్టార్గా ఆచార్య కె.సమత బాధ్యతల స్వీకరణ
Ens Balu
3
2020-07-25 21:15:37
ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్గా భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు కె.సమత ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డిని మర్యాద పూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు.తనకు రెక్టార్గా ఉద్యోగ బాధ్యతలు అప్పగించడంపట్ల హర్షం వ్యక్తంచేశారు. అనంతరం ఆచార్య కె.సమత వర్సిటీలోని సి.ఆర్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, వై.ఎస్ రాజశేఖరరెడ్డి, మహాత్మ జ్యోతిరావుఫూలే,బాబూజగ్జీవన్రామ్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళిఅర్పించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్, ఆటా అద్యక్షులు ఆచార్య జాలాదిరవి, ఏయూఇయూ అద్యక్షుడు జి.రవికుమార్, అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, ఆచార్య పి.అర్జున్, ఆచార్య టి.షారోన్ రాజు, ఆచార్య వి.సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.