ఏయూ సైకాలజీలో గంట్ల శ్రీనుబాబు టాపర్..
Ens Balu
2
ఆంధ్రాయూనివర్శిటీ
2020-12-02 21:54:18
ఆంధ్రాయూనివర్శిటీ సైకాలజీ విభాగంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్లశ్రీనుబాబు ఫైనల్ సెమిస్టర్ లో టాపర్ (8.50)గా నిలిచారు. ఓవరాల్ ఏయూ ఫస్ట్ గా రాపాక సుష్మ(8.10) నిలిచారు. ఓవరాల్ గా ఏయూ సెకెండ్ టాపర్ గా శ్రీనుబాబు(7.83) నిలవగా, మహిళల విభాగంలో ఎ.నాగశ్రీ(7.83) సెకెండ్ టాపర్ గా నిలిచారు. ఈ మేరకు ఆంధ్రాయూనివర్శిటీ 2018-20 బ్యాచ్ సైకాలజీ ఫలితాలను విడుదల చేసింది. ఇందులో టాపర్ గా నివడంతో సహచర జర్నలిస్టులు గంట్ల శ్రీనుబాబుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇదే సైకాలజీలో పీహెచ్డీ పూర్తిచేసి నిరుపేదలకు మానసిక సమస్యలపై సేవలు అందించాలనేది తన చిరకాల లక్ష్యమని చెప్పారు.ప్రభుత్వం కూడా ఇప్పుడిపుడే సైకాలజి చదివిన వారికి మంచి ఉపాది, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందున రానున్న రోజుల్లో ఏయూ సైకాలజీకి మంచి గుర్తింపు ఏర్పడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా సైకాలజీ విభాగం అధిపతి ఆచార్య ఎంవిఆర్ రాజు, ఇతర అద్యపక బ్రుందం సైకాలజీలో మంచి ప్రతిభ చూపిన విద్యార్ధులను అభినందించారు.