ఆ పరీక్షలకు ఆన్లైన్ లో దరాఖాస్తు చేయాలి..


Ens Balu
4
Srikakulam
2021-01-19 19:10:51

శ్రీకాకుళం జిల్లాలో మార్చి 2021 న జరగబోయే టెక్నికల్ సర్టిఫికేట్ కోర్సు పరీక్షలు డ్రాయింగ్, హాండ్ లూమ్ వివింగ్, టైలరింగ్ ఎంబ్రాయీడరీ లోవర్ గ్రేడ్ , హైయర్ గ్రేడ్ పరీక్షలు వ్రాయడానికి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి  ఒక ప్రకటనలో తెలియజేశారు. దానికోసం www.bseap.gov.inలో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫామ్, చాలనను జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయంలో అందజేయాలని పేర్కొన్నారు. లోయర్ పరీక్ష పాసైవారు హయర్ పరీక్ష వ్రాయటకు అర్హులని తెలియజేశారు. ఇతర రాష్ట్రాల బోర్డు ద్వారా పాస్ అయిన అబ్యర్ధులు ఈ పరీక్ష వ్రాయటకు సంచాలకులు ప్రభుత్వ పరీక్షల కార్యలయం ఆంధ్రప్రదేశ్ , విజయవాడ వారి నుంచి ముందుగా అనుమతి పొందాలని తెలియజేశారు. ఈ పరీక్షలకు ఫీజులు ఈ విధంగా ఉన్నాయి.. (1)డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ – రూ. 100/- (2)డ్రాయింగ్ హైయర్ గ్రేడ్ –రూ. 150/- (3)హాండ్ లూమ్ వివింగ్  లోయర్ – రూ.150/- (4) హాండ్ లూమ్ వివింగ్  హైయర్ రూ 200/- (5) టైలరింగ్ & ఎంబ్రాయీడరీ లోయర్  రూ.150/- (6) టైలరింగ్ & ఎంబ్రాయీడరీ హైయర్ రూ . 200/- అపరాధ రుసుము లేకుండా 30.01.21 వరకు,  50/- అపరాధ రుసుము 06.02.21,  75/- అపరాధ రుసుము 13.02.21తో దరఖాస్తు చేసుకొనవచ్చునని పేర్కొన్నారు.. అబ్యర్ధులు దరఖాస్తులను 16.02.21 న జిల్లా విద్యాశాఖాధికారి  కార్యాయలంలో అందజేయాలని పేర్కొన్నారు.