హాస్టల్‌ ‌నిర్మాణానికి ఎస్‌ఏఎల్‌పిజి సహకారం..


Ens Balu
4
Andhra University
2021-02-22 19:20:50

ఆంధ్రవిశ్వవిద్యాలయంలోని మహిళా ఇంజనీరింగ్‌ ‌కళాశాల విద్యార్థినులకు నూతన హాస్టల్‌ ‌నిర్మాణానికి సౌత్‌ ఏషియా ఎల్‌పిజి కంపెనీ ముందుకు వచ్చింది. రూ 2.5 కోట్ల వ్యయంతో నూతన హాస్టల్‌ను నిర్మించి ఏయూకు అందించనుంది. దీనికి సంబంధించిన ఒప్పంద పత్రాలపై సోమవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఎస్‌ఏఎల్‌పిజి సంస్థ సిఈఓ ఏ.ఎస్‌ ‌క్రిష్ణన్‌లు సంతకాలు చేశారు. మూడు అంతస్థుల్లో  రూ 2.5 కోట్ల వ్యయంతో ఈ హాస్టల్‌ను నిర్మిస్తారు. 36 గదులతో 108 మంది విద్యార్థులకు వసతి కల్పన జరిపే దిశగా దీనిని నిర్మిస్తున్నారు. హాస్టల్‌లో టీవీ రూమ్‌, ‌లైబ్రరీ, వాష్‌ ఏరియా, లాబీ వంటివి కల్పిస్తారు. విశ్వవిద్యాలయానికి సామాజిక బాధ్యతగా సహకారం అందించడానికి ముందకు వచ్చిన సౌత్‌ ఏషియా ఎల్‌పిజి కంపెనీ సంస్థ ప్రతినిధులను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో మహిళా ఇంజనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎస్‌.‌కె భట్టి, ఎస్‌ఏఎల్‌పిజి ప్రతినిధులు జి.ఎస్‌ ‌గిరిధరన్‌, ఏ.ఎస్‌.‌వి కొండల రావు తదితరులు పాల్గొన్నారు.