ఏపిసెట్లో 7.88 శాతం అర్హత..
Ens Balu
3
Andhra University
2021-02-22 19:29:43
రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపిసెట్ 2020 పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏపిసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం ఫలితాలు విడుదల చేసి వెబ్సైట్లో ఉంచామన్నారు. ఏపిసెట్ 2020 పరీక్షకు 26,527 మంది హాజరవగా వీరిలో 2090 మంది అర్హత సాధించారన్నారు. అర్హతా శాతం 7.88గా నమోదయిందన్నారు. డిసెంబర్ 20వ తేదీన 30 సబ్జెక్టుల్లో ఏపిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం ఏపిసెట్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. త్వరలో రాష్ట్రంలోని విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం, తిరుపతిల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతామన్నారు. సర్టిఫికేట్ల పరిశీలన తేదీలను ఆయా జిల్లాలకు అనుగుణంగా ప్రకటించున్నట్టు ఆయన వివరించారు.