ఆచార్య ఎం.వి.ఆర్ రాజుకు అభినందన..
Ens Balu
3
Andhra University
2021-02-24 18:50:59
ఆంధ్రవిశ్వవిద్యాలయం సైకాలజీ విభాగం సీనియర్ ఆచార్యులు ఎం.వి.ఆర్ రాజు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అప్లయిడ్ సైకాలజీ(ఐఏఏపి) జాతీయ అద్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాస రావు, విభాగాల ఆచార్యులు అభినందించారు. బుధవారం ఉదయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆచార్య ఎం.వి.ఆర్ రాజును సత్కరించారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పదవిని ఏయూ ఆచార్యులు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.