ఏయూతో ఐజెఎం ఎంఓయూ..
Ens Balu
2
Andhra University
2021-02-24 18:51:52
ఆంధ్రవిశ్వవిద్యాలయంతో ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్(ఐజెఎం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. బుధవారం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఐజెఎం సీనియర్ అసోసియేట్ శాంసన్ డేనియల్లు సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ఆచార్య ఎస్.హరనాథ్, దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.ఉష , పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఆచార్య క్రిష్ణమంజరి పవార్ తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కులు అమలు, నిర్భంద కార్మికులు, మానవ అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై పనిచేస్తారు.