ప్రభుత్వ పాఠశాలల్లో సీబిఎస్సీ సిలబస్..


Ens Balu
4
Tadepalle
2021-02-25 08:59:24

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలలు తమ రూపురేఖలు బయటే కాకుండా విద్యావిధానంలోనూ మార్పు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ పాఠశాలలు, కార్పోరేట్ పాఠశాలల్లో మాత్రమే అమలు చేసే సిబిఎస్సీ సిలబస్ ను వైఎస్సార్సీపీ వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటవ తరగతి నుంచి 7వ తరగతి వరకూ అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా ఆదేశాలు జారీ చేసింది. విద్యావ్యవస్థను పునాది స్థాయి నుంచే పటిష్టంగా అమలు చేయాలనే ఆలోచనతో ఒకటవ తరగతి నుంచే ప్రభుత్వం ఈ తరహా సిలబస్ ను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్ధులు, ఇంగ్లీషు, హిందీ తోపాటు ఇతర సబ్జెక్టులను కూడా ఇంగ్లీషు మాద్యమంలోనూ, హిందీ మాద్యమంలోనూ చదువుకోవడానికి వీలుపడుతుంది. వీరంతా 10వ తరగతికి వచ్చే నాటి చాలా వరకూ ఇంగ్లీషు, హిందీ బాషలు అనర్గళంగా మాట్లాడేందుకు, చదివేందుకు ఎంతో ఉపకరిస్తుంది. దానికోసం  ప్రభుత్వం ప్రస్తుతం వున్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇవ్వాలని యోచిస్తుంది. పైగా రానున్న ఐదేళ్లలలో భారీగా ఉపాధ్యాయుల రిటైర్ మెంట్లు ఉండటంతో ప్రత్యేక డిఎస్సీ ద్వారా లాంగ్వేజ్ పండిట్ లను, ఇంగ్లీషు మీడియంలో చదివిన ఉపాధ్యాయులను నియమించి ఈ సెంట్రల్ సిలబస్ ను క్రమేమీ ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అమలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మంది ఉపాద్యాయులు బిఈడీలోనూ ఇంగ్లీషు మెతడాలజీ సబ్జెక్టుగా చదువుకున్నవారు ఉన్నారు. అలాంటి యువతను ముందుగా ఈ ప్రత్యేక శిక్షణకు ఎంపిక చేసి వారి ద్వారా ఈ సెంట్రల్ సిలబస్ ను విద్యార్ధులకు బోధించాలనేది ప్రభుత్వ ఆలోచన. తెలుగు మీడియం చదివే పిల్లలకు వయస్సు మళ్లిన ఉపాధ్యాయులను, రిటైర్మెంట్ దగ్గర పడ్డ ఉపాధ్యాయులను నియమించి వారికి విద్యాబోధన చేయనున్నారు. కేజీ నుంచి పీజి వరకూ విద్యార్ధులు ఎక్కడా ఆటంకంలేకుండా చదువుకోవాలంటే దానికి సెంట్రల్ సిలబస్ మాత్రమే ఉత్తమమని భావించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు రావాలని చూస్తుంది. అయితే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా విద్యావ్యవస్థకు సంబంధించిన ఉపాధ్యాయ నియామకాల్లో లాంగ్వేజ్ పండిట్ నియామకాల్లో మొండి చేయి చూపిస్తూనే వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకు కూడా హిందీ బోధించాల్సి వుంటుంది. అలాంటి సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రాధమిక పాఠశాలల్లో హిందీ పండిట్ లను నియమించడం ద్వారా విద్యార్ధులంతా తరగతులు పెరిగే కొద్దీ వారికి హిందీ బాషపై పట్టువస్తుంది. లేదంటే ఒకేసారి సెంట్రల్ సిలబస్ ఏర్పాటు చేసినా ప్రస్తుతం వున్న ఉపాధ్యాయులు దానిని బోధించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వీటన్నింటినీ పరిగణలోని తీసుకున్న ప్రభుత్వం ప్రస్తుతం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారిలో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, కంప్యూటర్ విద్యపై సామర్ధ్యం బాగా ఉన్నవారిని గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించి వచ్చే ఏడాది నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాధమిక పాఠశాలల్లో సెంట్రల్ సిలబస్ ను ఏర్పాటు చేసి కార్పోరేట్ పాఠశాలలకు ధీటు తీర్చిదిద్దాలని నిర్ణయానికి అమలు దిశగా అడుగులు వేసింది. ఈ శుభపరిణామం విద్యావ్యవస్థలో మార్పులు ఏ విధంగా తీసుకువస్తుంది, ఉపాధ్యాయుల నియామకాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది.. ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురౌతుంది తదితర అంశాలు త్వరలోనే ఒక్కొక్కటిగా బయటకు రానున్నాయి. ఏం జరుగుతుందో వేచిచూడాలి మరి..!