సైకోమెట్రిక్ ఎక్స్ పోకు విశేష స్పందన..
Ens Balu
2
Andhra University
2021-02-27 19:34:56
ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకోమెట్రిక్ ఎక్సపోకు విశేష స్పందన లభిస్తోంది. శనివారం అత్యధిక సంఖ్యలో నర్సింగ్, జీవీఎంసీ పాఠశాలలు ఇతర విభాగాలకు చెందిన విద్యార్థులు,కార్మికులకు ఉచితంగా ఆరు రకాల పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఐఆర్ఎస్ అధికారి రవిచంద్ర,సైకాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎంవిఆర్ రాజు పాల్గొని, సైకోమెట్రిక్ పరీక్షల విశేషాలను, ఉపయోగం లు తెలియజేశారు. ఒత్తిడి, మానసిక సమస్యల బారి నుంచి ఈ పరీక్షల ద్వారా కాపాడుకోవచ్చని వారు వివరించారు. ప్రతీ రోజు, ఆరు రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామన్నారు. కరోనా సమయంలో ప్రంట్ లైన్ వారియర్స్ గా వైద్యులు, నర్సులు, పోలీసులు, జర్నలిస్టులు అందించిన సేవలు విశేషమన్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు, విద్యార్థి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించగా..అధ్యాపకులు డాక్టర్ సునీత సుభాషిణి, దామోదర్ నాయుడు, సీనియర్స్ జూనియర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.