తరగతులు పూర్తిస్థాయిలో నిర్వహించాలి..
Ens Balu
3
Andhra University
2021-02-27 19:46:45
ఆంధ్ర విశ్వవిద్యాయలయంలో అన్ని విభాగాల్లో తరగతుల నిర్వహణ పటిష్టంగా, పూర్తిస్థాయిలో జరగాలని ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత అన్నారు. శనివారం ఉదయం ఏయూ ఆర్టస్ కళాశాల పరిధిలోని పలు విభాగాలను తనిఖీ చేశారు. బోధన, బోధనేతర సిబ్బంది హాజరు పట్టికలు, తరగతుల నిర్వహణ జరగుతున్న విధానాలను పరిశీలించారు. విద్యార్థులను నిత్యం తరగతులకు హాజరు కావాలని సూచించారు. తరగతుల నిర్వహణ పటిష్టంగా జరపాలని తెలిపారు. సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని, తప్పనిసరిగా కోవిడ్ నియమావళి అనుసరించాలని చెప్పారు. అదే సమయంలో విద్యార్ధులను ప్రశ్నించి తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయమై ఆరాతీశారు. ఎవరికి అసౌకర్యం కలిగినా తక్షణమే సంబంధిత విద్యార్ధులు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే సమయంలో విద్యార్ధులు కూడా క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలని రెక్టార్ విద్యార్ధులకు సూచించారు.