ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకోవాలి..


Ens Balu
1
Paderu
2021-02-27 19:55:08

విద్యార్దులు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుంటే ఉన్నత ఉద్యోగావకాశాలను పొందవచ్చవని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల వివరించారు. 10 వతరగతి తరువాత తీసుకోవలసిన కోర్సులను ఆయన వివరించారు. ఇంటర్మీడియట్‌లో చేరే ముందు ఏగ్రూపులో చేరాలో ముందుగా ప్రశ్నించుకుని కళాశాలలో చేరాలన్నారు. బైపిసి, ఎంపిసిలో చేరామా అనేది ముఖ్యం కాదని, ఏగ్రూపులో చేరినా మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. శనివారం గురుకుల కళాశాల నుంచి రాష్ట్రంలోని గురుకుల విద్యార్దులకు వర్చవల్ విధానంలో కెరీర్‌గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ప్రభుత్వ రంగంకంటే ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు. తను డిల్లీ సివిల్స్ శిక్షణకు వెళ్లినపుడు డిల్లీ యూనివర్సీటీలో అనేక మంది విద్యార్దులు ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్, లా, జర్నలిజం, ఇంటీరియర్ డిజైనింగ్ వంటి డిగ్రీ కోర్సులలో చేరుతున్నారని చెప్పారు.ప్రభుత్వ సెక్టార్ కంటే ప్రైవేటు రంగాల్లో అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసారు.యూరోపియన్ దేశాలలో సగుటు ఆదాయం ఎక్కవగా ఉందన్నారు. అక్కడ ప్రభుత్వ రంగం కంటే ఎక్కవ మంది ప్రైవేటు రంగాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తారన్నారు. ఒకే ఉద్యోగం కోసం ఎదురు చూడడం వలన మన శక్తి సామర్ధ్యాలను తగ్గించుకోవడమన్నారు. మీ అందరిలో మంచి నైపుణ్యాలు ఉన్నాయని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.తమిళనాడులో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ప్రపంచంలోనే అతిపెద్ద సంస్ధ గూగుల్ సి ఇ ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుందర్‌పిచాయ్ విజయ ప్రస్తానాన్ని వివరించారు. ఐ ఎస్ ఎస్ , ఐ పి ఎస్, ఐ ఎఫ్ ఎస్ సర్వీసులే కాకుండా ఎకనామిక్స్ చదివిన విద్యార్దులకు ఇండియన్ ఎకనామిక్స్ సర్వీసెస్‌లోను, కామర్స్ తీసుకున్న విద్యార్దులకు చార్టెడ్ అకౌంట్ ఉద్యోగాలు, ఆర్కిటెక్చర్‌లో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. పట్టణాల్లో అధునిక నిర్మాణాలకు , మౌలిక సదుపాయాల కల్పనకు ఆర్కిటెక్చర్‌లకు అవకావాలు ఉంటాయని చెప్పారు. ఇంటీరియర్ డిజైనింగ్‌కు మంచి డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా లా చదివి న్యాయవాదులుగా స్దిరపడవచ్చని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగాల్లో స్దిరపడాలని అన్నారు. అదేవిధంగా క్రీడలలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురుకులం సెక్రటరీ డా. కె.శ్రీకాంత్ ప్రభాకర్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి. విజయ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్ బాబు ఎపి ఆర్ జెసి విద్యార్దినులు పాల్గొన్నారు.