ఏయూలో జాతీయ సైన్స్ దినోత్సవం..
Ens Balu
0
Andhra University
2021-02-28 21:34:38
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఆదివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిచారు. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాస రావు జియో ఫిజిక్స్ విభాగంలోని సి.వి రామన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశానికి సి.వి రామన్ అందించిన శాస్త్రీయ విజ్ఞానం, ఆవిష్కరణలు ప్రపంచ దేశాల సరసన భారత్ను నిలిపాయన్నారు. అనంతరం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సి.వి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ ప్రజలు శాస్త్రీయ విజ్ఞానంపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమన్నారు. శాస్త్రీయ ఆవిష్కరణలతో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్ రాణిస్తోందన్నారు. అంతరిక్ష రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తోదన్నారు.