ఒకరి రక్తదానం ఐదుగురికి ప్రాణదానం..


Ens Balu
1
Andhra University
2021-02-28 22:12:14

ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎన్‌సిసి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఉదయం నిర్వహించారు. ఎన్‌సిసి వలంటీర్లు స్వచ్చందంగా రక్తదానం చేశారు. కార్యక్రమాన్ని ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌ ‌ప్రారంభించారు. యువత స్వచ్చంద రక్తదాతలుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం నగరంలో రక్తం అవసరం పెరుగుతోందన్నారు. ఆపద సమయంలో రోగులకు అవసరమైన రక్తాన్ని అందించి వారి ప్రాణాలను రక్షించడంతో ఎంతో మంచి పరిణామన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ, నిర్వహిస్తున్న ఎన్‌సిసి అధికారులను రిజిస్ట్రార్‌ అభినందించారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ,  ఎన్‌సిసి లెఫ్ట్‌నెంట్‌ ‌డాక్టర్‌ ఎన్‌.ఎం ‌యుగంధర్‌, ఎన్‌సిసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.