హిందీ పరీక్షలకు ఈనెల 15 ఆఖరు..


Ens Balu
4
Paderu
2021-03-03 16:20:21

పాడేరు ఐటిడిఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్న విద్యార్ధులు హిందీ పరీక్షలు వ్రాయడం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చునని హిందీ ప్రచార సభ పాడేరు ఐటిడిఏ శాఖ  కన్వీనర్ శెట్టి సూరిబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార సభ  ఆధ్వర్యంలో ఏప్రిల్ నెలలో వివిధ హిందీ పరీక్షలు జరగనున్నాయని అందులో వివరించారు. ఆసక్తిగల 6 నుండి 9 వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు ఈనెల 15 వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. హిందీ పరీక్షలు వ్రాసి, అనంతరం హిందీ టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు ప్రభుత్వ,  ప్రైవేటు విద్యా సంస్థలలో ఉద్యోగాలకు అర్హులని తెలిపారు. విద్యార్థులకు జాతీయ భాషా పరిజ్ఞానం తోపాటు, ఉపాధి అవకాశాలు  మెరుగుపడతాయని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు 9490087286 నెంబర్ కు సంప్రదించి తెలుసుకోవచ్చునని సూరిబాబు తెలిపారు.