విద్యార్ధులకు భాషా నైపుణ్యం అవసరం..


Ens Balu
3
central tribal university
2021-03-03 18:08:38

నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులకు కమ్యూనికేషన్ నైపుణ్యాలు అవసరమని అ దిశగా విద్యార్థులకు ప్రత్యేక తర్పిదు యూనివర్శిటీలో ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ యూనివర్సిటీ విసి టి. వి. కట్టిమని పేర్కొన్నారు. బుధవారం యూనివర్సిటీలో  వివిధ కోర్సుల కు చెందిన అధ్యాపకులు, విద్యార్థుల తో వ్యక్తిత్వ వికాస అంశాలపై సమీక్ష్ నిర్వహించారు. ఈ సందర్భంగా విసీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగు సంస్కృతి, కళలు, భాష కు సంబందించి వివిధ యూనివర్సిటీ పరిశోధన, అధ్యయనాల ద్వారా విద్యార్ధులను ప్రోత్సహిస్తామని చెప్పారు. విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పోకెన్ హిందీ అంశాలలో బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు. విజయనగరం జిల్లాకు చెందిన గురజాడ అప్పారావు, ఘంటసాల, ఆదిభట్ల నారాయణ దాసు వంటి వారి రచనలు, కళలు, బొబ్బిలి వీణ విషయాల పై యూనివర్సిటీ లో ప్రత్యేక అధ్యయనాలు చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ స్పెషల్ ఆఫీసర్, ఇంచార్జ్ రిజిస్ట్రార్ తదితరులు పాల్గొన్నారు.