గిరిజన విద్యార్దులకు డిగ్రీ ప్రవేశం కల్పిస్తాం..
Ens Balu
1
Paderu
2021-03-10 16:40:30
విశాఖ మన్యంలోని గిరజనులు ఆన్లైన్ విధానంలో డిగ్రీ కళాశాలలో చేరలేకపోయిన అలాంటి వారికి ప్రవేశం కల్పిస్తామని పాడేరు సమీకృత గిరిజనాభివృధ్ది సంస్ధ ప్రాజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్ సలిజామల సష్టం చేసారు. బుధవారం పలువురు గిరిజన విద్యార్దులు డిగ్రీ కళాశాల ప్రవేశాలు కల్పించాలని ఐటిడి ఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారిని కలిసి విజ్ఞప్తి చేసారు. ఈసందర్బంగా ఆయన విద్యార్దులతో మాట్లాడుతూ, ఉన్నత విద్యాశాఖ కమీషనర్తో ఇప్పటికే చర్చించామని అన్నారు. ఈ విషయమై సానుకూలంగా ఉన్నారన్నారు. త్వరలోనే ప్రవేశాలు జరుగుతాయని విద్యార్ధులెవరూ ఈ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని పీఓ విద్యార్ధులకు భరోసా ఇచ్చారు.