నూతన విద్యా విధానాలతో విప్లవాత్మక మార్పులు..


Ens Balu
1
Kurnool
2021-03-19 18:59:09

నాణ్యమైన విద్యను అందిస్తూ సృజనాత్మక ఆవిష్కరణల వైపు యూనివర్సిటీ అడుగులు వేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. కర్నూలులోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం ఒకటి, రెండు, మూడు స్నాతకోత్సవాలు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లి నుండి ఆన్ లైన్ విధానంలో మంత్రి సురేష్ పాల్గొన్నారు. మంత్రి తన ప్రసంగం ఆద్యంతం ఉర్దూ లో కొంసాగించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్ మాట్లాడుతూ డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ భాష అభివృద్ధికి, ఒకేషనల్ టెక్నీకల్ విద్యను ఉర్దూ భాషలో బోధించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మాతృ భాషలో విద్యార్థులను బోధనా మరియు శిక్షణ ఇస్తూ ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం పొందేలా చేయాలన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒక విప్లవాత్మక మార్పు రానుందని ఇది ఉర్దూ యూనివర్సిటీ కి మంచి ప్రయోజనం కలిగిస్తుందన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా డిగ్రీలు పొందిన గ్రాడ్యుయేట్లను మంత్రి అభినందించారు. డిగ్రీలు పొందిన వారిలో ఎక్కువ మంది బాలికలే ఉండటం తో వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం మాజీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ మొహమ్మద్ అస్లాం పర్వైజ్, వైస్ ఛాన్సలర్ అచార్య ముజాఫర్ అలీ, రిజిస్ట్రార్ అచార్య శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.