విజయనగరం జిల్లా పార్వతీపురం ఐ.టి.డి. ఎ పార్వతీపురం పరిధిలో గల ఏకలవ్య మోడల్ రేసిడేన్షియల్ విద్యాలయాలలో 2020-21, 2021 - 22 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశానికి, 7, 8 తరగతులలో మిగిలి ఉన్న సీట్లకుగాను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనుటకు కొవిడ్ పరిస్థితులు, లాక్ డౌన్ దృష్ట్యా జూన్ 16, 2021 నుండి జూన్ 26, 2021 వరకు పొడిగించారు. ఈమేరకు ఆర్హులైన అభ్యర్థులు జూన్, 26 లాగా ఆన్లైన్ వెబ్ సైట్ www.aptwgurukulam.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని ఐ.టి.డి. ఎ ప్రోజెక్ట్ అధికారి ఆర్ కూర్మనాథ్ పేర్కొన్నారు. అలాగే ఇతర వివరాల కొరకు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ విద్యాలయం లేదా గురుకుల విద్యాలయాలలో సంప్రదించ గలరు, కన్వీనర్ ప్రిన్సిపల్ వారి సెల్ నెంబర్ 91990957213, గురుకులం సెల్ ఇంఛార్జి సెల్ నెంబర్ 9491064511 సంప్రదించాలన్నారు.