లాటరీ ద్వారా విద్యార్ధుల ఎంపిక..


Ens Balu
3
Vizianagaram
2021-07-19 13:21:54

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో ప్ర‌వేశాల కోసం డ్రా ద్వారా విద్యార్ధుల ఎంపిక కార్య‌క్ర‌మాన్ని జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్ సోమ‌వారం న‌గ‌రంలోని కంటోన్మెంట్‌లో వున్న‌ సెయింట్ ఆంథోని పాఠ‌శాల‌లో ప్రారంభించారు. ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్ధుల నుంచి డ్రా ద్వారా ఈ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఎంపిక‌లు నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంద‌ని జె.సి. పేర్కొన్నారు. జిల్లాలోని 16 ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు డ్రా లు నిర్వ‌హించి ఆయా పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశానికి ఒక్కో రోజు కొన్ని పాఠ‌శాల‌ల‌కు డ్రా లు నిర్వ‌హిస్తార‌ని పేర్కొన్నారు. సోమ‌వారం నాడు గ‌ర్భాం, భోగాపురం, ఎల్‌.కోట పాఠ‌శాలల్లో ప్ర‌వేశాల‌కు డ్రా నిర్వ‌హించామ‌న్నారు. ఒక్కో పాఠ‌శాల‌లో 80 సీట్ల భ‌ర్తీకి విద్యార్ధుల ఎంపిక ప్ర‌క్రియ నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి.నాగ‌మ‌ణి, స‌హాయ సంచాల‌కులు పి.బ్ర‌హ్మాజీ, క‌న్వీన‌ర్ కె.అప్పాజీరావు, ఆయా పాఠ‌శాల‌ల ప్ర‌దానోపాధ్యాయులు, విద్యార్ధులు, త‌ల్లిదండ్రులు పాల్గొన్నారు.