సిటియులో అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం..
Ens Balu
3
Vizianagaram
2021-08-09 13:38:01
గిరిజనుల వేషభాషలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం, కళలు, చేతి వృత్తులు క్రీడలను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య. టి.వి. కట్టిమణి అభిప్రాయ పడ్డారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ అదిమవాసి దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా “జాతీయ అంతర్జాల సదస్సు” లో సబాధ్యక్షుని ఆయన మాట్లాడారు.. గిరిజన భాషలను పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా వుందని.. అలాగే జనజాతీయులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగుపడవలసి వుందనన్నారు. దానికోసం ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం మధుర G.L.A యూనివర్సిటీ, అంతరించిపోతున్న భాషల విభాగాధిపతి ప్రొఫెసర్. పంచావన్ మహంతి మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన సంస్కృతి చాలా గొప్పవన్నారు. గిరిజనులకు మాతృభాష ప్రాధమిక స్థాయి నుండే విద్యా బోధన చేయాలని, ఉపయోగించాలని తద్వారా వారి భాషబివ్రుద్దికి జీవనశైలి మెరుగుదలకు ఉపయోగపడాలని ఆశాభావం వ్యక్తం చేసారు. విశ్వవిద్యాలయం పరిపాలనాధికారి డాక్టర్. ఎన్.వి.ఎస్. సూర్యనారాయణ ఆధ్వర్యం లో జరిగిన ఈ అంతర్జాలం వెబినార్ లో మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మహాముద్ మియాన్, ప్రొ దిరేష్ కులక్షేత్ర, ప్రొఫెసర్ హెచ్. లజపతిరాయ్, ఎస్. ప్రభాకర్ రావు, డాక్టర్ ఎం. శశిభుషణ్ , బి. జానకిరావు లు పాల్గొన్నారు.