వేదపాఠశాలల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు..
Ens Balu
2
Tirupati
2021-09-02 12:14:42
టిటిడి వేద పాఠశాలలో ప్రవేశాలకు 2021-22 విద్యాసంవత్సరానికి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించినట్టు నిర్వాహకులు తెలియజేశారు. పాఠశాలలో వివిధ కోర్సుల వివరాలు, అర్హత, దరఖాస్తు ఫారం ఇతర వివరాలకు www.tirumala.org వెబ్సైట్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. టిటిడి ఆధ్వర్యంలో నడపబడుచున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలలు 1. వేద విజ్ఞాన పీఠం, ధర్మగిరి, తిరుమల 2. కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా 3. ఐ. భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా 4. విజయనగరం, 5. నల్గొండ, 6. కోటప్పకొండ, గుంటూరు జిల్లాల నందు వేద పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో వివిధ కోర్సులలో ప్రవేశం కొరకు అర్హులైన బాలుర నుండి టిటిడి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వైదిక సాంప్రదాయం ప్రకారం ఉపనయనం కాబడి మరియు నిర్ణీత వయస్సు మరియు విద్యా ప్రమాణాలు కలిగిన వారు ఇందుకు అర్హులు. 2021, సెప్టెంబర్ 15వ తేది లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.