ఆపద సమయంలో (మూర్తీ)వభించిన రక్తదానం..!


Ens Balu
90
Visakhapatnam
2023-02-11 16:31:59

ఆపద సమయంలో ఒకరికి రక్తదానం చేయడమంటే నిజంగా ప్రాణదానం చేసినట్టుగానే వైద్యులు భావిస్తారు. విశాఖలో రామక్రిష్ణ అనే జర్నలిస్టు తల్లిగారికి అనారోగ్యం చేసి గీతం ఆసుపత్రిలో చేరారు. అత్యవసరంగా ఎ పాజిటివ్ రక్తం కావాల్సివచ్చింది.దీనితో జర్నలిస్టుల గ్రూపులో తనఅవసరాన్ని తెలియజేశాడు. ఆపద అంటే ఎవరికీ చెప్పిరా దు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రభ జర్నలిస్టుమూర్తి వెంటనే స్పందించి రక్తం దానం చేయడానికి ముందుకి వచ్చారు. అప్పటికప్పుడు నగరం నుంచి ఆసుపత్రికి వెళ్లా లంటే చాలా దూరం..మూర్తికి తన సహాయంగా కారులో తీసుకువెళ్లి సకాలంలో రక్తాన్నిదానం చేసేలా చేశారు మరో జర్నలిస్టు ఎమ్మెస్సార్ ప్రసాద్. వీరి తక్షణ సహాయం జర్నలిస్టు తల్లికి సకాలంలో రక్తం అందేలాచేసింది. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయంచేసే చేతులు మిన్న అన్న మంచి మాటకు నేడు నిజమైంది.  రక్తం దానం చేసిన మూర్తికి జర్నలిస్టుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.