రేణుకకు జాతీయ స్థాయిలో 2కాంశ్యాలు


Ens Balu
9
Vizianagaram
2022-05-19 10:16:37

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయినిలో ఈ నెల 13 నుండి 16 వరకు జరిగిన 13వ జాతీయస్థాయి టైక్వాండో పోటీల్లో పాల్గొన్న కుమారి మొకర రేణుకా శ్రీకరిణి రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకుంది.  జాతీయ స్థాయిలో టైక్వాండో పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండు కాంస్య పతకాలను సాధించిన క్రీడాకారిణి కుమారి మొకర రేణుకా శ్రీకరిణి ని శ్రీ ఎస్.వెంకటేష్, జిల్లా అటవీ శాఖాదికారి, శ్రీ కె.వి.ఎన్.రాజు గారు , సెక్షన్ అధికారి  శ్రీ బొత్స అప్పలరాజు, అటవీ పరిధి అధికారి శ్రీ కె.రామారావు గారు జిల్లా అటవీ కార్యాలయం,  అభినందించి, జాతీయ స్థాయిలో,  ఒలింపిక్స్ లో మన దేశానికీ ,  జిల్లాకు మంచి కీర్తిప్రతిష్టలు తేవాలని తెలిపినారు. హరిణి బాబా మెట్ట లోని ప్రభిత్వా బాలికల హై స్కూల్ నందు 9 వ తరగతి చదువుతోంది.