స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు ఎంపికలు


Ens Balu
4
Vizianagaram
2022-07-19 08:23:09

కడపలో గల వై.ఎస్.ఆర్ స్పోర్ట్స్ స్కూల్ లో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపికలు ప్రారంభం అయ్యాయి. మంగళవారం పార్వతీపురం మండలం నర్సిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ ఎస్.వెంకటేశ్వరావు నేతృత్వంలో ఎంపికలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SAAP) అదేశాలు,  జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అనుమతులు మేరకు 2022-23 సంవత్సరానికి  స్పోర్ట్స్ స్కూల్ లో 4వ తరగతిలో ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందని వేంకటేశ్వర రావు వివరించారు. నర్సిపురంలో 40 మంది బాలలు పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయిలో కడపలో పోటీలు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారికి స్పోర్ట్స్ స్కూల్ లో ప్రవేశాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు వెంకట రమణ, కార్యదర్శి ఎం.మురళీ, కార్యక్రమ సమన్యయకర్త వాసుదేవరావు నాయుడు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకట నాయుడు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.మురళీ, గాంధీ, కె.తిరుపతి రావు, తదితరులు పాల్గొన్నారు.