శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని శాసనసభ్యులు అలజంగి జోగారావు తెలిపారు. ప్రముఖ హాకీ క్రీడాకారులు, మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఆర్.సి.ఎం. స్కూలులో నిర్వహించిన జాతీయ క్రీడాదినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా హాజరయ్యారు. ఈ సంధర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నుండి ఆర్.సి.ఎం . స్కూలు వరకు జరిగిన ర్యాలీకి జాయింటు కలెక్టరు ఒ. ఆనంద్ జెండా ఊపి పారంభించారు. క్రీడా దినోత్సవ కార్యక్రమం ధ్యాన్ చంద్ చిత్రపటానికి శాసనసభ్యులు అలజంగి జోగారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ నిరంతర సాధనతోనే లక్ష్యాలను చేరుకోచ్చని, అబివృద్ది సాధనతోనే సాధ్యమని తెలిపారు.
విద్యార్థులకు చదువుతో పాటు, ఆటలు కూడా ముఖ్యమని తెలిపారు. జిల్లాలో మారుమూల ప్రాంతానికి చెందిన అర్జున అవార్డు గ్రహీత బాక్సింగు క్రీడాకారులు సీరా జయరాం, పారా ఒలింపియన్ రాముద్రి సోమేష్, జాతీయ స్వర్ణపతక విజేత బాడీ బిల్డర్ పడాల సంతోష్ ఎంతో కృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి స్పూర్తిగా నిలిచారని, వారి విజయాలు విద్యార్థులలో క్రీడా స్పూర్తిని నింపాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు క్రీడలలో రాణించి జిల్లాకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలన్నారు. ఆశయ సాధనకు ఎంతకష్టమైనా ఎదుర్కోవాలనే శ్రీ శ్రీ గారి మాటలకు స్పూర్తిగా తీసుకొని విజయాలు సాధించాలని తెలిపారు.
ఈ సంధర్బంగా అర్జు అవార్డు గ్రహీత బాక్సింగు క్రీడాకారుడు సీరా జయరాం, బాడీబిల్డింగులో జాతీయ స్వర్ణపతక విజేత పడాల సంతోష్, పారా ఒలింపియన్ రాముద్రి సోమేష్, కబాడీ జాతీయ క్రీడాకారులు కోట సంతోష్, కలయల రమేష్ లను సన్మానించారు. అదేవిధంగా కీడలలో రాణిస్తున్న పాఠశాలలు జిల్లాపరిషత్ బాలికల హైస్కూలు జి.ఎల్.పురం, వీరఘట్టం, నర్సిపురం, ఐ.టి.డి.ఎ. జి.జె.డబ్యు.ఎ.హైస్కూలు సీతంపేట, కొట్టగుడ పాఠశాలలకు పురస్కారాలందించారు. క్రీడాభివృద్దికి విశేషకృషి చేస్తున్న ఫిజికల్ డైరెక్టర్లు మూపాల శ్రీను, ఎవాల గణేష్, ఎం .చిన్నారావు, కోదండమణి, వి.పుప్షానందం, ఎస్. ఉమామహేశ్వరరావు, పి.సూరుపునాయుడు, పి. చంద్రమోహన్, ఎస్. దాలయ్య, ఎం .వెంకటేశ్వరావులను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోను గౌరీశ్వరి, క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వేంకటేశ్వర రావు, జిల్లా వృత్తి విద్యా శాఖ అధికారి డి. మంజుల వీణ, , గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ ఓ.ప్రభాకర రావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ప్రెసిడెంటు రామకృష్ణ, సెక్రటరీ ఎం.మురళీకృష్ణ, గాంధీ, కె.తిరుపతిరావు, ప్రభుత్వ హైస్కూలు విద్యార్థిని, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు.