రాష్ట్రక్రీడా పాఠశాలకు మన్యం విద్యార్ధులు


Ens Balu
10
Parvathipuram
2022-09-22 08:04:30

పార్వతీపురం మన్యం జిల్లా నుండి కడపలో గల డా. వై. ఎస్. ఆర్. రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపికైన నలుగురు   విద్యార్దినులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్  అబినందించారు.  క్రీడలలో  మంచి ప్రతిభ కనపరచి పతకాలు సాదించాలని,  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పాల్గొనేలా కష్టపడాలన్నారు.  పతకాలు సాదించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవాలన్నారు.  జిల్లా నుండి తోమ్మిది మంది క్రీడాకారులు గుంటూరులో జరిగిన ఎంపిక కార్యక్రమానికి వెళ్ళగా  నలుగురు ఎంపికయ్యారని  జిల్లా చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు.  పాలకొండకు చెందిన చింత కావ్యశ్రీ, పాండ్రంగి అక్షయ , మక్కువ మండలం బంగారువలస గ్రామానికి చెందిన షేక్ రషిత, మత్స జాస్మిని ఎంపికైనట్లు తెలిపారు.