జోన్ లో గల జిల్లాలకు చెందిన క్రీడా కారులు అక్టోబర్ 22, 23 తేదీల్లో జోనల్ స్థాయి శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొనుటకు ఆసక్తి కలిగిన బాలికలు & బాలుర మరియు పురుషుల & మహిళల విభాగములలో దరఖాస్తుల ను స్వికరిస్తున్నట్లు జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం..శేషగిరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా & కాకినాడ జిల్లా లకు సంబందించిన జోన్ లో గల క్రీడా కారులు అక్టోబర్ 22 (శనివారం) అక్టోబర్ 23 (ఆదివారం) తేదీలలో మున్సిపల్ టెన్నిస్ కోర్ట్స్, మోరంపూడి జంక్షన్, రాజమహేంద్రవరం నందు అండర్ -8, 10, 12, 14, 16, 18, బాలికలు & బాలుర మరియు పురుషుల & మహిళల విభాగములలో జరుగు జోనల్ స్థాయి శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొనుట నిమిత్తము ఆశక్తి గల క్రీడా కారులు రూ.400/-లు (రూ.100/-లు శాప్ పే & ప్లే ఖాతాకు క్యూ ఆర్ స్కాన్ ద్వారా & రూ.300/-లు నగదు రూపములో క్రీడా ప్రాంగణం వద్ద చెల్లించాల్సి వుంటుందన్నారు.
ఈ పోటీల్లో పాల్గొన తలచిన క్రీడాకారులు ఎంట్రీ ఫీజు ది.16.10.2022 లోపు చెల్లించాలన్నారు. సంబందించిన క్రీడా ప్రాంగణం వద్ద రూ.100/- క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి అక్టోబర్ 16 లోగా చెల్లింపులు చేయాలని పేర్కొన్నారు. వైస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ ఆదేశాల ప్రకారం ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్టు తెలియజేశారు. జోనల్ స్థాయి లో పాల్గొని ఎంపిక కాబడిన వారు తదుపరి రాష్ట్ర స్థాయి శాప్ టెన్నిస్ (8వ ఓపెన్) లీగ్ టోర్నమెంటు అక్టోబర్ 29 , 30 తేదీలలో విజయవాడ , ఇందిర గాంధీ మున్సిపాల్ స్టేడియం నందు జరుగు పోటీలకు హాజరు కావాలన్నారు.
ఆ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు రూ.500/-లు (రూ.150/-లు శాప్ పే & ప్లే ఖాతాకు క్యూ ఆర్ స్కాన్ ద్వారా & రూ.350/-లు నగదు రూపములో) ఎంట్రీ ఫీజు .24.10.2022 లోపు చెల్లించ వలసి ఉండునని పేర్కొన్నారు. మరిన్ని ఇతర వివరములకు ఎస్.దుర్గా కుమార్, కన్వీనర్, శాప్ టెన్నిస్ లీగ్ టోర్నమెంట్స్ 9177997766 ను లేదా గజేంద్ర : 9966420514 లో ఫోన్ ద్వారా సంప్రదించాలని సూచించారు.