జనవరి3 నుంచి జర్నలిస్టుల ఇంటర్ మీడియా స్పోర్ట్స్


Ens Balu
3
visakhapatnam
2022-12-16 09:11:29

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సీఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో జనవరి 3 నుంచి జర్నలిస్టుల క్రీడా పోటీలు( ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌) ను ఘనంగా నిర్వహించనున్నట్లు ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో కార్యదర్శి దాడి రవికుమార్‌, ఉపాధ్యక్షుడు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్‌.నాగరాజు పట్నాయక్‌, కోశాధికారి పిఎన్‌ మూర్తి, కార్యవర్గ సభ్యులతో కలసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర వేడుకులు, జర్నలిస్టుల క్రీడా పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై వీరంతా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నూతన సంవత్సర వేడుకులు ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇక జనవరి 3 నుంచి పోర్టు ఇండోర్‌ స్టేడియంలో ఇండోర్‌ గేమ్స్‌, నిర్వహించడం జరుగుతుందన్నారు.

 5 నుంచి పోర్టు క్రికెట్‌ మైదానంలో జర్నలిస్టుల క్రికెట్ పోటీలు జరుగుతాయన్నారు. అయితే ఆయా పోటీల్లో పాల్గొనే జర్నలిస్టులు ఈ నెల 25లోగా డాబాగార్డెన్స్‌ ప్రెస్‌క్లబ్‌ కార్యాలయం పనివేళల్లో తమ జాబితాలను అందజేయాలని కోరారు. అయితే అక్రిడేషన్‌, సంస్థ గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి విధిగా కలిగి ఉండాలన్నారు. గడువు దాటిని దరఖాస్తులను పరిగణలోకి తీసుకునే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, గయాజ్‌, శేఖర్‌ మంత్రి, సనపల మాధవరావు, డేవిడ్‌,గిరిబాబు,వరలక్ష్మీ, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.