ఉల్లాసంగా..ఉత్సాహంగా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్


Ens Balu
17
Visakhapatnam
2023-01-03 10:36:56

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌ తొలి రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభమైంది. టగ్‌ ఆఫ్‌ వార్‌ హోరాహోరీగా సాగింది. నాలుగు జట్లుగా 44 మంది జర్నలిస్టులు ఇందులో పాల్గొన్నారు. పురష, మహిళలకు వంద, రెండు వందల మీటర్ల పరుగుపందం, హైజంప్‌, లాంగ్‌ జంప్‌తో పాటు వివిధ పోటీలు నిర్వహించారు. ఫోరం సభ్యులు ఇరోతి ఈశ్వరరావు, దొండా గిరిబాబు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పి. దివాకర్‌, డేవిడ్‌, పి. వరలక్ష్మీ, మాధవరావు, గయాజ్‌, శేఖర్‌ మంత్రి,విస్జా ప్రతినిధులు ప్రకాశ్‌తో పాటు, వివిధ అసోసియేషన్లుకు చెందిన 45 మంది ఈ పోటీలను సమర్థవంతంగా నిర్వహించారు.