జర్నలిస్టుల క్రీడలు అభినందనీయం..జీవిఎంసీ కమిషనర్


Ens Balu
19
Visakhapatnam
2023-01-03 10:39:42

నిరంతరం సమాజానికి సేవలందించే జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమని జివిఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు కొనియాడారు. ఈ క్రీడలు దేశంలో ఇతర ప్రాంతాలకు ఆదర్శనీయంగా నిలుస్తాయన్నారు. మంగళవారం విశాఖ పోర్టు అవుట్‌ డోర్‌ మైదానంలో వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం, సిఎంఆర్‌, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ మీడియా స్పోర్ట్స్ మీట్‌కు ఆయన ముఖ్య అతిధిగాహాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ తాను అనేక ప్రాంతాల్లో పనిచేసినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో జర్నలిస్టుల క్రీడలను నిర్వహిస్తుండటం విశాఖలోనే చూసానన్నారు. విజెఎఫ్ అధ్యక్షుడు గంట్లశ్రీనుబాబు మాట్లాడుతూ, సభ్యుల సంక్షేమం కోసమే నిరంతరం పనిచేస్తున్నామన్నారు. కార్యదర్శి దాడి.రవికుమార్‌, ఉపాధ్యక్షుడు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్.నాగరాజు పట్నాయక్‌, విస్జా అధ్యక్షుడు ఉమాశంకర్‌బాబు పాల్గొన్నారు.