వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్, విస్జా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా బుధవారం రెండో రోజు క్రీడా పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్, చెస్,క్యారమ్స్, టెన్ని కాయట్ పోటీలు నిర్వహిస్తున్నట్టు విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలియజేశారు. ఆయా పోటీల్లో పాల్గొనే జర్నలిస్టులు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకొనే సదుపాయం కూడా కల్పించినట్టు ఆయన వివరించారు. ఆయా పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఇంటర్ మీడియా స్పోర్ట్స్ విభాగం కోరింది. కాగా జట్లలో విజేతలుగా నిలిచిన వారిని అదే రోజు ప్రకటిస్తున్నారు.