ప్రజాశక్తి జట్టుపై..లోకల్ ఛానల్స్ జట్టు విజయం


Ens Balu
14
Visakhapatnam
2023-01-05 08:13:35

విజెఎఫ్, సీఎంఆర్, విస్జా సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న జర్నలిస్టుల క్రీడల పోటీల్లో 3వ రోజు క్రికెట్ పోటీ హోరా హోరీగా జరిగింది. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో ప్రజాశక్తి టీమ్ పై లోకల్ ఛానల్స్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమానికి ముందు జనసేన సీనియర్ నాయకులు బి.సత్యన్నారాయణ జర్నలిస్టుల క్రీడల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు నిత్యం వార్తల కోసమే కాకుండా ఇలాంటి క్రీడా సంబరాల్లో పాల్గొనడం ద్వారా శారీరక వ్యాయామం కలుగుతుందన్నారు.

విజెఎఫ్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన ఎస్.దుర్గారావు, శ్రీదేవి ఛానెల్ అధినేత  రామకృష్ణరాజు, బీజేపి అధ్యక్షుడిగా సేవలందించిన పీవీ చలపతిరావు, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసిరావు, మృతి పట్ల జర్నలిస్టులంతా ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మైత్రీ మీడియా అధినేత అవనాపువిక్రమ్, స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్ బాబు, భాస్కర్, రామ్, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, నాగరాజు పట్నాయర్,డి గిరిబాబు, ఎమ్మెస్సార్ ప్రసాద్, పైల దివాకర్, శేఖర మంత్రి, ప్రజాపిత బ్రహ్మకుమారి  బికే.రామేశ్వరి తదితరులు జర్నలిస్టులు పాల్గొన్నారు.