సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడే జర్నలిస్టులకు గెలుపు, ఓటములతో సంబంధం లేదని వారు ఎప్పుడూ నిరంతర విజేతలే నని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా శుక్రవారం నాటి క్రికెట్ పోటీలకు జడ్పీ చైర్పర్సన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ విజేతలు ఎవరైనప్పటికీ ఒకే విధంగా భావించాలన్నారు. గెలిచిన జట్టు ఎక్కువ, ఓడిన వారు తక్కువేమీ కాదన్నారు.. ప్రతీ ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ నిర్వహించే కార్యక్రమాల్లో తనను తప్పకుండా భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా అతిథులు కాసేపు బ్యాటింగ్ చేసి క్రీడాకారులు ను ఉత్సాహపరిచారు. వీరిని విజేఎఫ్,
విస్జా కార్య వర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు.