రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అందించడంలో ముందు వరుసలో ఉందని ఎమ్మెల్సీ సిహెచ్.వంశీక్రిష్ణశ్రీనివాస్ అన్నారు. విశాఖజిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారం తో నిర్వహించిన జిమ్నాస్టిక్స్ చాంపియన్ షిప్ -2023 పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఎమ్మెల్సీ వంశీకృష్ణ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో సూర్య కుమార్, కళ్యాణి, జైన్ తదితరులు పాల్గొన్నారు.