త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..మంత్రి గుడివాడ


Ens Balu
19
Visakhapatnam
2023-01-09 10:19:54

రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు తమ ప్రభుత్వం కృత నిష్చయము తో  ఉంద ని రాష్ట్ర భారీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం.. సిఎంఆర్ ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా సోమవారం పోర్టు మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ లకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. విశాఖలో పెండింగ్ లో ఉన్న 2005 జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి ఇటీవలే తాను స్వయముగా అధికారులతో మాట్లాడి వారి సూచన మేరకు న్యాయ సలహా కోసం సంబంధిత ఫైలును పంపించానని చెప్పారు. అక్కడి నుంచి ఫైల్ క్లియర్ కాగానే  తదుపరి చర్యలు  తీసుకుంటారన్నారు. తనకు పదవులతో పనిలేదని తనను నిరంతరం తనను ప్రోత్సహించేది జర్నలిస్టులేనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి తనకు తగిన ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ, మీడియా వల్ల  తాను ఈస్థాయీకి చేరుకోగలిగానన్నారు.

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం కార్యవర్గం సుదీర్ఘకాలంగా పాత్రికేయులు సంక్షేమానికి పాటుపడుతుందని తాను అన్నిటిలో బాగస్వామి అవుతున్నానన్నారు. ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా క్రమం తప్పకుండా జర్నలిస్టుల క్రీడా సంబరాలు నిర్వహిస్తున్నా మన్నారు. విద్యా, వైద్యంతో పాటు జర్నలిస్టుల క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు.  ఉపాధ్యక్షులు ఆర్.నాగరాజు పట్నాయక్ స్వాగతం పలికి  మాట్లడుతూ తక్షణమే 2005 జర్నలిస్ట్ ల ఇళ్ళ స్థలాల సమస్య  పరిష్కరించాలని మంత్రిని కోరారు. అందుకు మంత్రి గుడివాడ సానుకూలం గా స్పందించారు..

కార్యదర్శి దాడి రవికుమార్ మాట్లాడుతూ, విజేతలు ఎవరైనప్పటికీ  క్రీడా స్ఫూర్తితో  అందరు ముందుకు సాగడం ప్రశంసనీయమన్నారు. 22 క్యాటగిరీల్లో జర్నలిస్టులకు క్రీడలు నిర్వహించడం ఎంతో కష్టమైనప్పటికీ అందరి సహకారంతో పూర్తి చేయగలిగామన్నారు. అనంతరం మంత్రిని  వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా సింహాద్రినాథుడు జ్ఞాపికను శ్రీనుబాబు బహూ కరించారు. కార్యక్రమంలో తొలుత ఇరు జట్ల క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకుని కాసేపు బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. విశాఖ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు ఉమా శంకర్ బాబు,చైర్మన్  జి. నరసింహారావు, కోశాధికారి పి.భాస్కర్కార్యవర్గ సభ్యులు ఎమ్మెస్సార్ ప్రసాద్, గిరిబాబు వరలక్ష్మి దివాకర్, ఈశ్వర్ రావు మాధవరావు శేఖర్ మంత్రి తదితరులు పాల్గొన్నారు.