క్రీడలతో విద్యార్ధులకు ఉజ్వల భవిష్యత్తు


Ens Balu
13
Srikakulam
2023-01-22 15:28:40

క్రీడలతోనే విద్యార్ధులకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాష్ట్ర కళింగ వైశ్య కార్పోరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు అన్నారు. ప్రతి ఒక్కరు  క్రీడలలో రాణించేందుకు ముందుకురావాలన్నారు. శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆద్వర్యంలో నగరంలోని వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ ,క్యాడెట్ ,జూనియర్స్ ,సీనియర్స్ విభాగాలలో నిర్వహించిన తైక్వాండో పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ చైర్ పర్శన్ ఎం.వి.పద్మావతి ,చీఫ్ కోచ్ మాధురీలత ,వైకాపా నేత శిమ్మ రాజశేఖర్ ,సీనియర్ న్యాయవాది నౌపడ విజయ్ కుమార్ , ఒలంపిక్ అసోసియేన్ కార్యదర్శి సుందరరావు, కోణార్క్ శ్రీను ,మెంటాడ స్వరూప్ ,అంధవరపు ప్రసాద్ ,సూర శ్రీనివాసరావు,బోయిన పృద్ధ్వీ తదితరులు అంతా కలిసి పోటీలను ప్రారంభించారు.