విశాఖలో మూడు రోజులు కళాకారుల క్రికెట్ టోర్నీ..


Ens Balu
41
Visakhapatnam
2023-02-17 11:02:38

 విశాఖపట్నం కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ బ్రోచర్ ను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమె చాంబర్లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ  మార్చి నెల 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు విశాఖ కళాకారుల క్రికెట్ టోర్నమెంట్ జ్ఞానాపురం గోల్డెన్ జూబ్లీ స్కూల్ నందు నిర్వహించేందుకు నేడు బ్రోచర్లను ఆవిష్కరించడం జరిగిందని, ఇందులో విశాఖ నగరం నుండి వివిధ రంగాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి ఫ్లోర్ లీడర్ బాణాలు శ్రీనివాసరావు, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, కళాకారుల సంఘం అధ్యక్షుడు జనార్ధన్, విష్ణు పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ యాదవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.