ఫెన్సింగ్ పోటీల్లో విజేతలుగా తిరిగి రావాలి..


Ens Balu
42
Srikakulam
2023-03-20 08:31:55

జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటి విజేతలుగా తిరిగిరావాలని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపికైన సీనియర్  క్రీడాకారులకి ఎస్పీ జి.ఆర్ .రాధిక పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. ఎస్సీ కార్యాలయంలో సోమవారం జాతీయ స్థాయి పోటీలకి బయలుదేరే ఇద్దరు ఫెన్సింగ్ క్రీడాకారిణిను, కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలలో మెడల్స్ సాధించిన 4గురు క్రీడాకారిణిలను ఆమె అభినందించారు.  క్రీడాకారిణిలతో ముచ్చటించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా జాతీయ ఫెన్సింగ్ పోటీలలో రాణించాలన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను నిరూపించుకుని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఫెన్సింగ్  కోచ్ వంశీని ఎస్పీ ప్రత్యేకంగా  అభినందించారు.