ఏపీఎల్ -2 లో కోస్టల్ రైడర్స్ జట్టు విజయం


Ens Balu
59
Visakhapatnam
2023-08-22 16:23:27

ఆంధ్ర క్రికెట్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ 2 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం  జరిగిన  మ్యాచ్ లో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. 35 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది.  తొలుత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న కోస్టల్ రైడర్స్ జట్టు బ్యాట్స్మ్యాన్లు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 173 పరుగులు సాధించారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన ధరణి కుమార్ 32 బంతుల్లో 3సిక్స్ లు, 8 ఫోర్లు తో 59 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో దిగిన ఎం.హర్షవర్ధన్ 22 బంతుల్లో 35 పరుగులు చేశారు. మిగతా వారంతా సమష్టిగా రాణించలేక పోయారు.దీంతో 173 పరుగుల టార్గెట్ ను గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు.  బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్ బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 18.1 ఓవర్లలో 138 పరుగులు మత్రమే చేసి అల్ ఔట్ అయ్యి ఓటమి పాలయ్యా రు. 3వ స్థానంలో దిగిన ఎం. హేమంత్ రెడ్డి మత్రమే 4 సిక్స్ లు, 5 ఫోర్లు తో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మిగతా జట్టు సభ్యులు అంతగా రాణించ లేకపోయారు. కోస్టల్ రైడర్స్ జట్టు బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి గోదావరి టైటాన్స్ జట్టుని 138 పరుగుల వద్ద ఆల్ ఔట్ చేశారు. 35 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం కైవసం చేసుకుంది.